డీఎస్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుల సంతాపం!!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి.శ్రీనివాస్ మృతికి ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న డి.శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు.
డీఎస్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
డీఎస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. శ్రీనివాస్ ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసే వారని....తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారని చంద్రబాబు అన్నారు. డి.శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంతాపం తెలియజేశారు. మాజీ మంత్రి డి.శ్రీనివాస్ మరణం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.

డీఎస్ ను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న డి. శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారన్నారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిశానని, నా రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి అడిగి.. జనసేన పార్టీ ఎదుగుదలను ఆకాంక్షించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.
డీఎస్ మృతి పట్ల మంత్రి కొలను పార్ధసారధి
వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. శ్రీనివాస్ కుమారుడు, లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి కూడా సంతాపం తెలిపారు.
డీఎస్ రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించే వారు
డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి పార్థసారథి,ఆయన మరణవార్త బాధాకరం అన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకు అంకితమైన నాయకుడు డి. శ్రీనివాస్ అన్నారు. తనకు డి.శ్రీనివాస్తో మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్ ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారన్నారు.
డీఎస్ మరణం తీరని లోటు అన్న కొలను పార్ధసారధి
అందరితో సమన్వయంతో పని చేస్తూనే.. పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్, ఉన్నతవిద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా విశేష సేవలు అందించిన వ్యక్తి డి. శ్రీనివాస్ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన ముద్ర వేసిన డి. శ్రీనివాస్ మరణం తీరని లోటు అని వ్యాఖ్యానించారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?












Click it and Unblock the Notifications