కరాటే రాజుకి సీఎం కేసీఆర్ అభినందన (ఫోటో)
హైదరాబాద్: యుకే తైక్వాండో ఓపెన్లో పాల్గొని కాంస్య పతకం సాధించిన రాజు నాయక్ (కరాటే రాజు)ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఛైర్మన్ రాజు నాయక్ మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ రాజు నాయక్ మరిన్ని విజయాలు సాధించాలని, అంతర్జాతీయ స్ధాయిలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని అభిషలాషించారు. ఈ లక్ష్య సాధనలో రాజు నాయక్కు అవసరమైన సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు.













Click it and Unblock the Notifications