నిర్దేశించిన సమయంలో పనులు పూర్తికాకుంటే రాజీనామా తప్పదు, నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్
Recommended Video

గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పినా.. పెడచెవిన పెట్టారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోవాలని.. లేదంటే రాజీనామా చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. మంగళవారం ప్రగతి భవన్లో నిర్వహించిన మున్సిపల్ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతోన్న పనులపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మూడు నెలల్లో ప్రక్రియ పూర్తవాలని స్పష్టంచేశారు. విద్యుత్ సమస్యలను కూడా తీర్చాలని తేల్చిచెప్పారు. దీనిని ఎనిమిది నెలల గడువు విధించారు. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తవకుంటే నేతలకు పదవులు, అధికారులకు ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు.

సంబంధిత ప్రజాప్రతినిధులు రాజీనామా తప్పదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. లేదంటే సంబంధిత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. కొన్ని మున్సిపాలిటీలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయని.. వాటిని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపాలిటీకి చెడ్డపేరు తీసుకొచ్చేవారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. మున్సిపాలిటీల్లో అవినీతి మరక పోవాలన్నారు.
పది రోజుల పాటు పట్టణ ప్రగతి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతోన్న పనుల వివరాలు తెలుసుకొని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications