ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విందు: సీఎం రేవంత్ హాజరు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గురువారం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఈ రాత్రి ప్రజాప్రతినిధులకు, ఆర్థిక శాఖ అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో రూ. 2,91,159 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

గత ఫిబ్రవరి నెలలో లోక్సభ ఎన్నికల ముంగిట మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రప్రభుత్వం.. ఇవాళ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతుభరోసా, సంక్షేమ రంగాలకు సింహభాగం నిధులను కేటాయించారు. ఇటీవల ప్రకటించిన కేంద్రబడ్జెట్లో తెలంగాణకు మొండిచెయి చూపారంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మాత్యులు శ్రీ భట్టి విక్రమార్క ఇచ్చిన విందులో ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సంప్రదాయకంగా మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు డిప్యూటీ… pic.twitter.com/RJOEjbaS85
— Telangana CMO (@TelanganaCMO) July 25, 2024
2.91 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హామీల అమలే లక్ష్యంగా రూ. 2 లక్షల 91వేల 159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభకు సమర్పించారు.
ఇందులో రెవెన్యూ రాబడి రూ. 2 లక్షల 21వేల 242 కోట్లు, మూలధన రాబడి రూ.69వేల 572 ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ. లక్షా 38వేల 181 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 35వేల 208 కోట్లు వస్తుందని డిప్యటీ సీఎం పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26వేల 216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21వేల 636 కోట్ల రూపాయలు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా రూ. 57వేల 112 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా రూ. 3 వేల 900కోట్లు, ఇతర రుణాల ద్వారా వెయ్యి కోట్లు సమకూర్చుకుంటామని వెల్లడించారు.
-
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
Telangana Budget 2026 :సంక్షేమం అభివృద్ధికే భట్టి బడ్జెట్ అధిక ప్రాధాన్యత..? -
ప్రతి నెల రూ.2 వేల స్కాలర్ షిప్, విద్యార్థుల కోసం అభయహస్తం -
ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షలు, బడ్జెట్ లో భట్టి ప్రకటన - విధి విధానాలు..!! -
తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
నేడే తెలంగాణ బడ్జెట్.. కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం -
డాడీ, మోదీ, చిన్న మోదీపైనే నా పోరాటం: కవిత -
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే!









Click it and Unblock the Notifications