అమిత్ షా ముందకు కీలక ప్రతిపాదన?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బుధవారం రాత్రి ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, డీజీపీ బీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఐబీ చీఫ్ సుమతి తదితరులు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.
రాష్ట్రంలో పెరుగుతున్న పరిపాలనా, భద్రతా అవసరాల దృష్ట్యా అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాడర్ సమీక్ష 2016లో జరిగింది. 2021లో జరగాల్సిన తదుపరి సమీక్ష ఆలస్యమైంది. 2025కు వాయిదా పడింది. అప్పట్లో ఏడుగురు అదనపు ఐపీఎస్ అధికారులను మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని రేవంత్ రెడ్డి వివరించారు. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, వైట్కలర్ నేరాలు, ఇతర నూతన భద్రతా బెదిరింపులతో సహా పలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని వివరించారు. హైదరాబాద్ జనాభా పెరుగుదల, అలాగే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో అదనపు పరిపాలనా డిమాండ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 83 ఐపీఎస్ అధికారుల మంజూరైన బలగాన్ని 105కు పెంచాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
షెడ్యూల్ ప్రకారం 2026లో జరగాల్సిన మూడవ క్యాడర్ సమీక్షను సకాలంలో నిర్వహించాలని కూడా ఆయన అమిత్ షాను కోరారు. మావోయిస్టుల లొంగుబాటు, వారి పునరావాసం అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గత రెండేళ్లుగా తెలంగాణలో పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కాలంలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని, జన జీవన స్రవంతిలో కలిశారని గుర్తు చేశారు.
పలువురు సీనియర్ మావోయిస్టు నాయకులు సైతం ఇటీవల సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పరిహారం, పునరావాస సహాయం అందిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పనులకు కేంద్రం నుండి ఆర్థిక సహాయాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు.
-
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
మూసీ తీరాన మహత్తరం -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications