సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సంగారెడ్డి: కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు. మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు.
తన రాజకీయ ఎదుగుదలలో మెతుకుసీమది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా లేదని అన్నారు. హామీలు అమల చేయమని అడిగితే బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ఇప్పటికైనా బాగా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.

మేం కడుపులో పెట్టుకున్న రైతులు ఇవాళ ఆగమయ్యారు. రైతు బంధులేదు. రైతు బీమా లేదు. సాగుకు కరెంటు లేదు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలి. అప్పుడే మంచి.. చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు. స్యయంగా ముఖ్యమంత్రే జంప్ కొడతారేమో తెలియదు. ఇక, బీజేపీకి ఓటు వేసినా.. మంజీరా నదిలో వేసిన ఒకటే. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం.. దాన్ని వదిలించుకోవాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అన్ని సర్వేలు చెప్తున్నయ్.. కాంగ్రెస్ కు వచ్చేది 2 సీట్లే
— BRS Party (@BRSparty) April 16, 2024
అందుకే ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటెయ్యమని చెప్తున్నడు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/SqTCauaO7J
సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారు?
అంబేద్కర్ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురు 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం. ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనేలేదు. కనీసం పూలు పెట్టలేదు. నివాళుర్పించలేదు. నేను నిర్మించానని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లలేదు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా అని కేసీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయం నేనే నిర్మించా.. మూసేస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
అంబేద్కర్ ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా? అవమానించినవారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని కేసీఆర్ అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగు నెలలైనా చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ.. ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి. దీని కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్ పోస్టుకార్డు ఉద్యమం చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications