ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, హైదరాబాద్ను క్రీడా హబ్గా మార్చాలని నిర్ణయించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ స్టేడియం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హెలిప్యాడ్, అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు.
ఇదే సమయంలో క్రీడలు.. సామాజిక సేవల్లో ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా వీరితో నిర్వహించిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ గచ్చిబౌలి స్టేడియం కోసం కొత్త ప్రతిపాదనలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ రూపకల్పనలో భాగంగా పలువురి ప్రముఖుల సహకారం తో పాటుగా బాధ్యతలు కేటాయించారు. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్గా ఆమెను నియమించింది. ఇక.. హైదరాబాద్ను దేశపు క్రీడా రాజధానిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో భారీ అడుగు వేశారు. గచ్చీబౌలి స్టేడియాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో 'తెలంగాణ స్పోర్ట్స్ హబ్'గా తీర్చిదిద్దేందుకు సంబంధించి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా సంజీవ్ గోయెంకా, ఉపాసన కొణిదెల, కావ్య మారన్ వంటి ప్రముఖులు ఈ బోర్డులో సభ్యులుగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉపాసన, కావ్యకు స్టేడియం అభివృద్ధిపై సీఎం పూర్తి స్వేచ్ఛ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సమీక్షలో భాగంగా తన లక్ష్యాల ను వివరించారు. గచ్చీబౌలి స్టేడియం రూపురేఖలను మార్చేలా పలు సూచనలు చేశారు. స్పోర్ట్స్ హబ్ చైర్మన్గా సంజీవ్ గోయెంకా, కో-చైర్మన్గా ఉపాసన కొణిదెల, సభ్యురాలిగా కావ్య మారన్ కి స్టేడియం అభివృద్ధిపై సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చైనాలోని క్రీడా సౌకర్యాలను మించేలా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలని, భవిష్యత్తులో ఒలింపిక్స్ నిర్వహించే స్థాయికి హైదరాబాద్ ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. క్రీడాకారులు విమానాశ్రయం నుండి నేరుగా స్టేడియానికి చేరుకునేలా ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గచ్చిబౌలిలోని లక్షలాది మంది ఐటీ ఉద్యోగులను ఆకర్షించేలా స్టేడియంలో భారీ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!













Click it and Unblock the Notifications