సుజుపై డిజీపికి ఫిర్యాదు..! 11 మందిని చంపితే ఎందుకు కేసు పెట్టలేదని కిషన్ రెడ్డి సూటి ప్రశ్న..!
హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అంటూనే తనపై సయ్యద్ సుజా అనే సైబర్ నిపుణుడు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ ఆరోపణలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో స్క్రిప్ట్ తయారు చేసుకుని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ లండన్లో సయ్యద్ సుజాతో ఆరోపణలు చేయించారని కిషన్ రెడ్డి విమర్శించారు.

సయ్యద్ సుజా ఎవరో.. అతని ముఖం ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు. ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన దుయ్యబట్టారు. తాను 11 మందిని చంపితే వాళ్ల కుటుంబసభ్యులు ఆ వ్యక్తులపై మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టలేదని కిషన్రెడ్డి నిలదీశారు. ఈ విషయంపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఓడిపోయినదానికంటే తమ పార్టీ 5 స్థానాల నుంచి ఒకటికి పడిపోవడం బాధించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నట్లు కిషన్రెడ్డి వివరించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications