"నేరెళ్లలో కెటిఆర్ గుట్టుగా పర్యటించి కేసును నీరు గార్చారా ?"
హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఘటనకు బాధ్యత వహించి ఇప్పటికే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన కెటిఆర్ గుట్టుగా పర్యటించి కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారని తెలంగాణ కాంగ్రెసు కమిటీ కోశాధికారి, ఎఐసిసి సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు.
నేరెళ్ల ఘటనపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నేరెళ్ల ఘటనపై అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. తద్వారా ప్రభుత్వ నిజ స్వరూపాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు. పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్న తీరును న్యాయస్థానాల దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు.

నేరెళ్ల ఘటనకు బాధ్యత వహించి మంత్రి కెటిఆర్ రాజీనామా చేయాలని పిసిసి అధికార ప్రతినిధి జి. నిరంజన్ డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలోని నేరెళ్లలో దళితులపై, బీసీలపై పోలీసులు జరిపిన దౌర్జన్యం గురించి తెలియదని, స్థానిక నాయకులు సరైన సమాచారం ఇవ్వలేనది కెటిఆర్ బుకాయిస్తున్నారని ఆయన విమర్శించారు.
కటిఆర్ శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. సంఘటన జరిగిన ఐదు వారాలకు బధితులను పరామర్శించడానికి వెళ్లిన కెటిఆర్ ప్రజా సమస్యలపై ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుస్తోందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications