కొండా పై పార్టీ క్రమశిక్షణా సంఘం అనూహ్య నిర్ణయం..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కొండా వివాదం సంచలనంగా మారుతోంది. కొండా దంపతుల పైన కాంగ్రెస్ వరంగల్ జిల్లా నేతలు చేసిన ఫిర్యాదుల పై పార్టీ ఫోకస్ చేసింది. క్రమశిక్షణా సంఘం ఈ ఫిర్యాదు లపైన విచారణ మొదలు పెట్టింది. కొండా వ్యాఖ్యలు.. తదనంనతర పరిణామాల పైన ఆరా తీసిన కమిటీ.. ఈ వివాదం పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో పార్టీలో నెలకొన్న వివాదాల పైన చర్చించింది. దీంతో, కొండా దంపతుల పైన పార్టీ తీసుకొనే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
కొండా మురళీ సొంత పార్టీ నేతల పైన చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసారు. కొండా దంపతుల పైన చర్యలు తీసుకుంటారా.. లేక, తమ నిర్ణయం తామే తీసుకోవాలో తేల్చి చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ వివాదం పైన పార్టీ పరిశీలకుల నుంచి నివేదిక కోరామని.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశం పైన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీ అయింది. కొండా సురేఖ పై ఫిర్యాదుల పై చర్చించింది. కొండా వ్యాఖ్యలు.. పార్టీ నేతల ఫిర్యాదుల పైన ఆరా తీసింది. కొండా కు సంజాయిషీ నోటీసులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక, శనివారం మరోసారి క్రమశిక్షణా సంఘం భేటీ కావాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగిన సమావేశంలో కొండా వివాదంతో పాటుగా ఆసీఫాబాద్ పరిణామాల పైన చర్చ చేసినట్లు పార్టీ నేతల సమాచారం. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో సొంత పార్టీ నేతల పైన వ్యాఖ్యలు చేయటం.. వివాదాలు ఏంటని ఇప్పటికే పార్టీ పరిశీలకులు కొండా పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో పార్టీ నేతలెవరూ మీడియాలో మాట్లాడవద్దని.. పార్టీలో ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించిన చర్యలు ఉంటాయని మీనాక్షీ నటరాజన్ హామీ ఇచ్చారు. పార్టీ నేతల సమాచారం ప్రకారం కొండా మురళీ పైన చర్యలకు పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పార్టీకి కొండా దంపతులు ఎలాంటి వివరణ ఇస్తారనేది కీలకంగా మారుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో సంచలనంగా మారింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications