Vijayashanti: తెలంగాణ ప్రజలు కేసీఆర్పై దండయాత్ర చేయాలని పిలుపునిచ్చిన విజయశాంతి
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్ ను మరోసారి గద్దెనెక్కించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలపై దండయాత్ర చేసిందన్నారు. అలంపూర్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రాజెక్టులు, ధరణి పోర్టల్, గ్రానైట్ బిజినెస్, డ్రగ్స్, మందు, గంజాయి సరఫరాతో ప్రజలపై దండయాత్ర చేసి దోపిడీ చేశారని విజయశాంతి పేర్కొన్నారు. 317 జీవో తో ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. యువత, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.
కేసీఆర్, ఆయన కూతురు, కొడుకు, అల్లుడు వారి బినామీలు తెలంగాణలోని నాలుగు కోట్లు జనాభాను దోచుకుతిన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు తిన్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ.. 420గాళ్లతో చేతులు కలిపిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ గెలిస్తే.. తెలంగాణ ప్రజలు మరోసారి దోపిడీకి గురవుతారని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించి దోపిడీకి చరమగీతం పాడి తెలంగాణ ప్రజలను రక్షించాలని విజయశాంతి ప్రజలను కోరారు.

కేసీఆర్ పై నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దండయాత్ర చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల రూపాయల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ రోజు కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయే విధంగా ఉంది. కాళేశ్వరం కేసీఆర్ ను కాటేసే కాటేశ్వరం అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రభుత్వాన్ని కాటికి పంపించే ఈశ్వరం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తుందన్నారు. అవి యువకులు, మహిళలు, రైతులు, వృద్ధులు పనికొచ్చివేవిగా ఉన్నాయి.
కేసీఆర్ అవినీతిపై బీజేపీ మాట్లాడుతుంది కానీ చర్యలు తీసుకోవడం లేదని విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీ మారానని తెలిపారు. ప్రజల సమస్యలను తాను తెలుసుకున్నానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి ఆరు హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications