అమిత్ షా దెబ్బకు కెసిఆర్ అన్న కూతురు రమ్య బిజెపిలోకి
తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు గాను ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తనాయకులకు బిజెపి వలవేస్తోంది.అయితే కాంగ్రెస్ పార్ నుండి నేతల వలసలు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు గాను ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తనాయకులకు బిజెపి వలవేస్తోంది.అయితే కాంగ్రెస్ పార్ నుండి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది రమ్య కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పారు. బిజెపిలో చేరుతున్నట్టు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ ఉన్న రోజునే ఆ పార్టీకి షాకిచ్చింది ఆ పార్టీ అధికారప్రతినిధి రమ్య. పార్టీని వీడుతున్నట్టు ఆమె ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న కూతురే రమ్య.

మూడురోజులపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగానే ఇతర పార్టీల నుండి వలసలు ఉంటాయనే ప్రచారం సాగింది. కానీ, అమిత్ షా సెప్టెంబర్ టూర్ లో వలసలు ఉంటాయని ఆ పార్టీ ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందకుగాను బిజెపి పావులు కదు.పుతోంది.ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులతో కమలనాధులు చర్చలను ప్రారంభించారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ మాసంలో అమిత్ షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వలసలు పెరగనున్నాయని బిజెపి నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications