హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ భయం .. బ్రిటన్ నుండి వచ్చిన 15 మందికి పాజిటివ్
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్న అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ పెద్ద ఎత్తున సాగుతోంది. భారతదేశంలోనూ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది . ఒకపక్క వాక్సినేషన్ కొనసాగుతున్నా , కరోనా కేసులు కూడా బాగా తగ్గినా, కరోనా టెన్షన్ మాత్రం ఇంకా వదలడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వందల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు కావడం కాస్త ఊరటనిస్తున్నా , తాజాగా హైదరాబాద్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ పెడుతోంది.
Recommended Video

యూకే నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణీకులకు కరోనా పాజిటివ్
యూకే నుంచి హైదరాబాద్ వస్తున్న చాలామంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ రావడం హైదరాబాద్ వాసులను ఆందోళనకు గురి చేస్తుంది. మొన్నటి వరకు హైదరాబాద్ లో కరోనా పంజా విసిరింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక మరణాలు కూడా హైదరాబాద్ లోనే సంభవించాయి. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో తాజాగా బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఐదు విమానాలలో 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది.

బ్రిటన్ నుండి హైదరాబాద్ కు వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్
అయితే వీరికి సోకింది కరోనా కొత్త స్ట్రెయినా .. లేక మ్యూటేట్ కాని పాత కరోనావైరస్ నా అన్నది నిర్ధారణ కావలసి ఉంది.
ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన 15 మందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో, వారు కూర్చున్న సీట్లకు ముందు వెనక మూడు వరుసలలోని ప్రయాణికులను కూడా అధికారులు క్వారంటైన్ చేశారు. బ్రిటన్లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా పరీక్షలు చేయించుకున్న ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చింది .

పాజిటివ్ వచ్చిన వారితో పాటు ప్రయాణించిన వారికి క్వారంటైన్
కానీ ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలటం కలకలం రేపుతోంది. దీంతో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన మరో ముప్పై మందిని కూడా క్వారంటైన్ లో ఉండాలని సూచించారు అధికారులు. అయితే బ్రిటన్ నుంచి ప్రయాణం చేయడంతో కొత్త స్ట్రెయిన్ పై తీవ్ర ఆందోళన నెలకొంది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!











Click it and Unblock the Notifications