ఫ్లెక్సీలు వాడటంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం, కార్పోరేటర్కు రూ.50వేల ఫైన్
హైదరాబాద్: మలక్పేట పర్యటనలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు కట్టిన వారికి జరిమానా విధించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

మలక్పేట్ ఇండోర్ స్టేడియం ప్రారంభం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు కట్టిన కార్పొరేటర్ సునరితా రెడ్డికి రూ. 50 వేలు, మాజీ కార్పొరేటర్ అస్లాంకు రూ.25 వేల జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications