కేసీఆర్ ఫైర్: కరోనాకు అధిక వసూళ్లు -మరో 6 ప్రైవేట్ ఆస్పత్రులపై వేటు -జాబితాలో కిమ్స్, సన్ షైన్, సెంచరీ..
ఆవిర్భాక సంబురాలకు సిద్ధమైన తెలంగాణలో ఆరోగ్య రంగానికి సంబంధించి మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్ధారించిన రుసుము కంటే అధికంగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు రావడంతో హైదరాబాద్ లోని మరో ఆరు ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం వేటేసంది. ఆయా ఆస్పుల్లో కొవిడ్ చికిత్స లైసెన్సులను రద్దు చేసింది.
భారత్ డీలా-డ్రాగన్ జోరు: చైనా తయారీ రెండో వ్యాక్సిన్ 'సైనోవాక్’కు WHO అనుమతి -మన ఫార్మాకు దెబ్బ
కొవిడ్ ట్రీట్మెంట్ లైసెన్సులు రద్దయిన ఆస్పత్రుల జాబితాలో ప్రఖ్యాత, దక్షిణ భారతానికే పేరెన్నికగల ఆస్పత్రులూ ఉండటం గమనార్హం. సర్కారు వేటేసిన ఆస్పత్రుల్లో సికింద్రాబాద్ కిమ్స్, సన్ షైన్ ఆస్పత్రి(గచ్చిబౌలి), సెంచరీ ఆస్పత్రి(బంజారాహిల్స్), లోటల్ ఆస్పత్రి(లక్డీకాపూల్), మెడిసిస్ ఆస్పత్రి(ఎల్బీ నగర్), ఇంటెగ్రో ఆస్పత్రి(టోలీచౌకీ)లు ఉన్నాయి.
తాజాగా వేటు పడిన ఆరు ఆస్పత్రులను కలుపుకొని ఇప్పటిదాకా తెంగాణ ప్రభుత్వం చర్యలకు తీసుకున్న ఆస్పత్రుల సంఖ్య 33కు పెరిగింది. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల్లోని ఆస్పత్రులూ ఈ జాబితాలో ఉన్నాయి. కొవిడ్ చికిత్సకు అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ కఠిన ఆదేశాలివ్వడంతో అధికారులు ఆమేరకు చురుకుగా స్పందిస్తున్నారు.
శృంగార తార షకీలా ఔదార్యం: పేదలకు ఆహారం పంపిణీ -లాక్డౌన్ ఎత్తివేతపై ముఖ్యమంత్రి కీలక ప్రకటక
Recommended Video
కొవిడ్ లైన్సులు కొల్పోయిన జాబితాలోని ఆరూ ఆస్పత్రుల్లో మూడు పెద్ద, ప్రముఖ ఆస్పత్రులే కావడంతో అక్కడి రోగుల పరిస్థితిని అధికారులు పర్యవేక్షించి, కొత్త కేసులు అడ్మిట్ కాకుండా జాగ్రత్తలు వహిస్తారు. ఇదిలా ఉంటే, మంగళవారం నాడు తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి.