కరోనా విలయం: వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు రద్దు -21న శ్రీరామ నవమి ఆన్ లైన్లోనే
తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 5093 కొత్త కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరగాల్సిన అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్లు, రాజకీయ నాయకుల పర్యటనలు, పలు ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ దర్శనాలు రద్దయ్యాయి.

బయటి నుంచే మొక్కులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొవిడ్ కేసులు అమాంతం పెరగడం, వాటిలో ఎక్కువ కేసులు టెంపుల్ టౌన్ వేములవాడలోనే నమోదవుతోన్న క్రమంలో శ్రీరాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలోకి భక్తుల ప్రవేశం నిలిపివేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం బయట నుంచి మొక్కులు అప్పగించి వెళ్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. దర్శనాల రద్దు ఆదివారం నుంచి ఈనెల 22 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నాలుగు రోజులు ఆలయంలో అర్జిత సేవలతో పాటు దర్శనాలు, ధర్మశాల అద్దెలు నిషేధించారు.

అప్పుడు కలరా.. ఇప్పుడు కరోనా..
గతంలో 1980లో కలరా వ్యాపించిన సందర్భంలో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయాన్ని 40 రోజులపాటు మూసివేశారు. మళ్లీ గతేడాది కరోనా కారణంగా అలాంటి పరిస్థితే తలెత్తింది. అన్ లాక్ లో భాగంగా తెరుచుకున్న ఆలయాలు కాస్తా ఇప్పుడు రెండో దశ వ్యాప్తితో మళ్లీ మూతపడుతున్నాయి. ప్రస్తుతానికి దర్శనాలను మాత్రమే రద్దు చేసిన అధికారులు.. రాబోయే రోజుల్లో తీవ్రతను బట్టి మూసివేతపై నిర్ణయం తీసుకోనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం ఒక్కరోజే కొత్తగా 106 కేసులు బయటపడ్డాయి. కాగా,
Recommended Video

ఆన్లైన్లో శ్రీరామ నవమి వేడుక
వేములవాడలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో ఫిజికల్ దర్శనాన్ని నిలిపేసిన అధికారులు.. భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్లోనే స్వామి వారి ఆర్జిత సేవలు అందుబాటులోకి తెచ్చారు. వేములవాడలో ఆదివారం(18) నుంచి 24 వరకు రాములోరి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21న శ్రీ రామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ వేడుకలను ఆన్ లైన్ లో వీక్షించవచ్చని, టీఎస్ మీసేవ 2.0 లేదా టీ ఆప్ ఫోలియో ద్వారా అర్జిత సేవల రుసుము చెల్లించి, భక్తుల గోత్ర నామాల మీద మొక్కులు చెల్లించుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications