మ్యాచ్ ఎఫెక్ట్: రోడ్లు ఖాళీ, యువత కేరింత(పిక్చర్స్)
హైదరాబాద్: 2015 ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడంతో నగరవాసుల ఉత్సాహం మిన్నంటింది. త్రివర్ణ పతాకాలు చేతబూని రంగులు చల్లుకుంటూ.. కేరింతలు కొడుతూ ర్యాలీలుగా సాగి సందడి చేశారు క్రికెట్ అభిమానులు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు హోటళ్లు.. బార్లు.. రెస్టారెంట్లు.. స్టేడియాలు.. షాపులు.. ఇలా ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం. తలతిప్పకుండా టీవీలకు అతుక్కుపోయిన వైనం. ముందే వరల్డ్ కప్ మ్యాచ్. అందునా.. ఇండియా-పాకిస్థాన్ మధ్య పోరు. అంతకంటే ఉత్కంఠ ఏముంటుందిక. ఆదివారం మధ్యాహ్నం వరకు నగరంలో ఇలాంటి ఉత్కంఠే కనిపించింది.
మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అనంతరం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ విజయ ఢంకా మోగించగానే.. ఒక్కసారిగా నగరం సంబరాల్లో మునిగితేలింది.
అప్పటి వరకూ బోసిపోయిన రోడ్ల వెంట ఒక్కటే జనం.. ఈళలు, కేకలు, టపాసుల మోత.. పలు ప్రాంతాల్లో కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ జెండాలను ఊపుతూ అన్ని వర్గాల ప్రజలు జాతీయ సమైక్యతను చాటారు.
సంబరాలు
2015 ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడంతో నగరవాసుల ఉత్సాహం మిన్నంటింది.
సంబరాలు
త్రివర్ణ పతాకాలు చేతబూని రంగులు చల్లుకుంటూ.. కేరింతలు కొడుతూ ర్యాలీలుగా సాగి సందడి చేశారు క్రికెట్ అభిమానులు.
సంబరాలు
మ్యాచ్ ప్రారంభానికి ముందు హోటళ్లు.. బార్లు.. రెస్టారెంట్లు.. స్టేడియాలు.. షాపులు.. ఇలా ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం.
ఖాళీ రోడ్లు
నగరవాసులంతా టీవీలకు అతుక్కుపోవడంతో రోడ్లు ఖాళీగా కనిపించాయి.
ఖాళీ రోడ్లు
మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
ఖాళీ రోడ్లు
తలతిప్పకుండా టీవీలకు అతుక్కుపోయిన వైనం. ముందే వరల్డ్ కప్ మ్యాచ్. అందునా.. ఇండియా-పాకిస్థాన్ మధ్య పోరు. అంతకంటే ఉత్కంఠ ఏముంటుందిక. ఆదివారం మధ్యాహ్నం వరకు నగరంలో ఇలాంటి ఉత్కంఠే కనిపించింది.
సంబరాలు
అనంతరం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ విజయ ఢంకా మోగించగానే.. ఒక్కసారిగా నగరం సంబరాల్లో మునిగితేలింది.
సంబరాలు
అప్పటి వరకూ బోసిపోయిన రోడ్ల వెంట ఒక్కటే జనం.. ఈళలు, కేకలు, టపాసుల మోత.. పలు ప్రాంతాల్లో కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
సంబరాలు
బాణాసంచా పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ జెండాలను ఊపుతూ అన్ని వర్గాల ప్రజలు జాతీయ సమైక్యతను చాటారు.
సంబరాలు
2015 ప్రపంచ కప్ క్రికెట్లో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడంతో నగరవాసుల ఉత్సాహం మిన్నంటింది.
సంబరాలు
త్రివర్ణ పతాకాలు చేతబూని రంగులు చల్లుకుంటూ.. కేరింతలు కొడుతూ ర్యాలీలుగా సాగి సందడి చేశారు క్రికెట్ అభిమానులు.
సంబరాలు
మ్యాచ్ ప్రారంభానికి ముందు హోటళ్లు.. బార్లు.. రెస్టారెంట్లు.. స్టేడియాలు.. షాపులు.. ఇలా ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనం.
సంబరాలు
తలతిప్పకుండా టీవీలకు అతుక్కుపోయిన వైనం. ముందే వరల్డ్ కప్ మ్యాచ్. అందునా.. ఇండియా-పాకిస్థాన్ మధ్య పోరు.
సంబరాలు
అంతకంటే ఉత్కంఠ ఏముంటుందిక. ఆదివారం మధ్యాహ్నం వరకు నగరంలో ఇలాంటి ఉత్కంఠే కనిపించింది.
ఖాళీగా రోడ్లు
మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
ఖాళీగా రోడ్లు
మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
ఖాళీగా రోడ్లు
మ్యాచ్ ముగిసే వరకు నగరంలోని రోడ్లపై ఒక్కరూ కనిపించలేదు. దీంతో రహదారుల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీంతో పలువురు చిన్నారులు రోడ్డుపైనే క్రికెట్ ఆడుతున్న దృశ్యం.