నగదు ఇవ్వమంటే...బ్యాంకు మూసేసి వెళ్ళిపోయాడు
నాలుగు రోజులుగా బోరబండ సిండికేట్ బ్యాంకు లో ఖాతాదారులకు డబ్బులు ఇవ్వడం లేదు. నగదు కోసం ప్రతిరోజూ బ్యాంకుకు రావడం ఇబ్బంది పడడం ఖాతాదారులకు ఇబ్బందిగా మారింది. సోమవారం కూడ అదే పరిస్థితి రిపీట్ అయింది. ఈ
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్లు రద్దు చేసిన పదమూడు రోజులు దాటినా ప్రజలకు కరెన్సీ సక్రమంగా అందడం లేదు.నాలుగు రోజులుగా నగదు దొరకకపోవడంతో బ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు బయపడిన మేనేజర్ బ్యాంకును మూసివేసి వెళ్ళిపోయారు.
హైద్రాబాద్ లో పలు చోట్ల బ్యాంకులు, ఎటిఎం లవద్ద కొత్త కరెన్సీ కోసం బారులు తీరుతున్నారు. నాలుగు రోజులుగా బోరబండలోని సిండికేట్ బ్యాంకు నుండి ఖాతాదారులకు నగదు అందడం లేదు. నగదు కోసం ఖాతాదారులు సోమవారం నాడు బ్యాంకుకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు.

బోరబండలోని సిండికేట్ బ్యాంకులో నాలుగు రోజులుగా నగదు ఇవ్వడం లేదు.గంటల తరబడి బారులు తీరి క్యూ లైన్లలో ఉన్న నగదు ఇవ్వకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు.
నాలుగు రోజులుగా ఇదే తంతు బ్యాంకు వద్ద కన్పిస్తోంది. సోమవారం నాడు కూడ అదే తంతు కన్పించింది. బ్యాంకు తెరవగానే నగదు ఇవ్వాలని ఖాతాదారులు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దరిమిలా మేనేజర్ బ్యాంకునుమూసివేసి భయంతో వెళ్ళిపోయారు.












Click it and Unblock the Notifications