వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్‌కు షాక్: ట్విస్టిచ్చిన డీఎస్! కాంగ్రెస్‌లో చేరిన నర్సారెడ్డి, రాములు నాయక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Assembly Elections 2018 : రాహుల్ గాంధీతో డీఎస్ భేటీ

న్యూఢిల్లీ: తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై సీనియర్ రాజకీయ నాయకుడు డీ శ్రీనివాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డీఎస్ భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

రాహుల్‌తో భేటీపై డీఎస్

రాహుల్‌తో భేటీపై డీఎస్

అయితే, భేటీ అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడానికి సమయం అడిగానని చెప్పారు. తనకు రాహుల్ సమయం ఇచ్చారని.. ఆయనను కలిశానని తెలిపారు. అయితే రాహుల్‌తో ఏం మాట్లాడానో మీతో చెప్పాల్సిన పనిలేదని ఆయన మీడియానుద్దేశించి అన్నారు.

‘అతడు' సినిమాలోలానే ప్లాన్: ‘జగన్‌పై దాడి'పై సోమిరెడ్డి, ‘పిల్లాడితో చంపిస్తామా?' <br /> ‘అతడు' సినిమాలోలానే ప్లాన్: ‘జగన్‌పై దాడి'పై సోమిరెడ్డి, ‘పిల్లాడితో చంపిస్తామా?'

కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పానా?

కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పానా?

తాను చాలా మంది నేతలను గతంలో కలిశానని, కలుస్తూనే ఉంటానని డీ శ్రీనివాస్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని మీకు ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించడం గమనార్హం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన నర్సారెడ్డి, రాములు నాయక్

కాంగ్రెస్ పార్టీలో చేరిన నర్సారెడ్డి, రాములు నాయక్

కాగా, గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు టీ నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో శనివారం రాహుల్ గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. అయితే వీరితోపాటు డీఎస్ కూడా కాంగ్రెస్‌లో చేరినట్లు వచ్చినా.. డీఎస్ స్పందన మాత్రం మరోలా ఉంది.

అందుకే కాంగ్రెస్ పార్టీలోకి..

అందుకే కాంగ్రెస్ పార్టీలోకి..

బంగారు తెలంగాణ సాధిస్తామన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన నర్సారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

English summary
TRS MP D srinivas meets Rahul Gandhi: Narsa Reddy, Ramulu Naik joins congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X