సుష్మతో మాట్లాడా: లిబియా కిడ్నాప్పై దత్తాత్రేయ, క్షేమంగా: కంభంపాటి
హైదరాబాద్/న్యూఢిల్లీ: లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న తెలుగువారు బలరాం, గోపీకృష్ణలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కోరామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం చెప్పారు.
ఆయన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి విషయమై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. ఉస్మానియా రోగులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన సౌకర్యాలి కల్పించాలన్నారు.
ఉగ్రవాదుల చెరలో బందీలైన తెలుగు వారు క్షేమంగానే ఉన్నారని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వేరుగా అన్నారు. లిబియాలో భారత రాయబారి రషీద్తో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.

అక్కడి విశ్వవిద్యాలయం డీన్తో బందీలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్తోనూ మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
గత బుధవారం లిబియాలోని ట్రిపోలీ సమీపంలో విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న నలుగురు భారతీయులను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అందులో ఇద్దరు కర్నాటక వాసులను విడుదల చేశారు. తెలుగువారిని విడుదల చేయవలసి ఉంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications