ఎల్లుండి ఇంటర్ బోర్డు వద్ద మహాధర్నా : కోదండరాం
హైదరాబాద్ : ఇంటర్ బోర్డులో జరిగిని అవకతవకలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎల్లుండి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వద్ద చేపట్టే మహాధర్నాకు జెండాలు పక్కనపెట్టి పార్టీలన్నీ తరలి రావాలని ఆయన కోరారు.

దోషులెవరు ?
శనివారం సోమాజిగడ ప్రెస్ క్లబ్ లో 'ఇంటర్ ఫలితాలు- దోషులు-పరిస్కారం' అనే అంశంపై విద్యార్థి జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పిదాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రొఫెస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తప్పులు దొర్లాయని ఆయన మండిపడ్డారు.
క్షమాపణ చెప్పండి
మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ .. 23 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ కారణమని మండిపడ్డారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని .. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications