ఎల్లుండి ఇంటర్ బోర్డు వద్ద మహాధర్నా : కోదండరాం
హైదరాబాద్ : ఇంటర్ బోర్డులో జరిగిని అవకతవకలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎల్లుండి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వద్ద చేపట్టే మహాధర్నాకు జెండాలు పక్కనపెట్టి పార్టీలన్నీ తరలి రావాలని ఆయన కోరారు.

దోషులెవరు ?
శనివారం సోమాజిగడ ప్రెస్ క్లబ్ లో 'ఇంటర్ ఫలితాలు- దోషులు-పరిస్కారం' అనే అంశంపై విద్యార్థి జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తప్పిదాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రొఫెస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తప్పులు దొర్లాయని ఆయన మండిపడ్డారు.
క్షమాపణ చెప్పండి
మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ .. 23 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ కారణమని మండిపడ్డారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొని .. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు.












Click it and Unblock the Notifications