Rajamouli: అమిత్ షాను కలవనున్న దర్శకుడు రాజమౌళి.. ఎందుకంటే..!
తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అధిష్ఠానం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. అమిత్ షా బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు.
హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షాను ప్రముఖ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కలవనున్నారు. వీరు సమావేశం అవుతారన్న వార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలను ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కూడా అమిత్ షాను కలుస్తుండడం ఆసక్తిగా మారింది.

అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 14న సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 15 తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో భద్రాచలంకు వెళ్తారు. మధ్యాహ్నం 2.20 నుంచి 3.20 గంటల వరకు సీతారాములను దర్శించుకుంటారు.
అనంతరం ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్కు చేరుకుంటారు.రాత్రి 7 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి 9:30 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications