179 కిలోల డ్రగ్స్: హైదరాబాద్లో మళ్లీ కలకలం.. ఇద్దరి అరెస్ట్..
కంపెనీపై దాడి చేసిన అధికారులు 179 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ను షేక్ చేసిన డ్రగ్స్.. రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా బొల్లారంలో భారీ డ్రగ్స్ దందా వెలుగుచూసింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల దాడులతో డ్రగ్స్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన బొల్లారంలో ఓ కంపెనీ కేంద్రంగా డ్రగ్స్ దందా జరుగుతున్నట్టు ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ కంపెనీపై దాడి చేసిన అధికారులు 179 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దాడుల సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వీరిద్దరిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముందన్నారు. కాగా, ఇదే ప్రాంతంలో గతంలోను డ్రగ్స్ వెలుగుచూసినట్టు తెలుస్తోంది.
కంపెనీకి ఎటువంటి పేరు లేదని, రూ. 2 లక్షలకు 15రోజుల పాటు రియాక్టర్ ను లీజుకు తీసుకున్న వ్యక్తులు ఎపిడ్రిన్ ను తయారు చేశారని ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎపిడ్రిన్తో పాటు మెటామిథామైన్ను కూడా వీరు తయారు చేస్తున్నారని తెలిపారు. రానున్న కొత్త సంవత్సరం వేడుకల్లో పెద్ద ఎత్తున విక్రయించాలన్న ఉద్దేశంతోనే ఈ డ్రగ్స్ దందాకు తెరలేపినట్టు పోలీసులు గుర్తించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications