రేవంత్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి: కాంగ్రెస్ వైఖరిపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సుదీర్ఘ లేఖ రాశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి భాషపై కాంగ్రెస్ అధిష్టానం అభ్యంతరం చెప్పకపోవడంపై హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు. రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్.. కేసీఆర్పై రేవంత్ భాషను కట్టడి చేయకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఒక రూల్.. గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని విమర్శించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. రేవంత్ భాషను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్కు బీజేపీ వ్యాఖ్యలను ఖండించే నైతిక హక్కు కూడా లేదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమని.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని హరీశ్ రావు విమర్శించారు. పోలీసులు సీఎం రేవంత్కు కీలుబొమ్మలుగా మారి నియంతృత్వ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సీఎం అనుచరులు నేరాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
Open Letter to Shri @kharge ji , President, AICC
— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2024
Subject: The Hypocrisy of Indian National Congress in Encouraging shri @revanth_anumula Abusive & Criminal Language Against Shri @KCRBRSPresident Garu, President, @BRSparty – An Appeal for Stern Disciplinary Action.@RahulGandhi… pic.twitter.com/wRNvBiXzw6
హమీలపై నిలదీస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీరు పట్ల కాంగ్రెస్ అధిష్టానం మౌనం దురదృష్టకరం. తెలంగాణలోని పరిస్థితి మహాభారతాన్ని గుర్తు చేస్తోంది. ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడి క్రూరమైన అతిక్రమణలను ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్టు కాంగ్రెస్ అధిష్టానం తీరు ఉందని హరీశ్రావు దుయ్యబట్టారు. రేవంత్ భాషను కట్టడి చేయాలని కాంగ్రెస్ అధిష్టానానికి మరోసారి స్పష్టం చేశారు.
-
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ రాజకీయ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications