హైదరాబాద్ TO అరుణాచలం.. అతి తక్కువ ధరకే IRCTC బెస్ట్ ప్యాకేజీ..!
మహా శివరాత్రిని పురస్కరించుకుని అనేకమంది భక్తులు జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తుంటారు. అలాంటి వారికోసం IRCTC బెస్ట్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా తక్కువ ధరకే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ టూర్ లో భాగంగా అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
దివ్య దక్షిణ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ నుంచి రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు టికెట్ వివరాలు చూస్తే పెద్దలకు రూ.14,700 గా ఉంది. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్ ధరను అధికారులు నిర్ణయించారు. ఇక కంఫర్ట్ క్లాస్ అయితే పెద్దలకు రూ. 28,700, చిన్నారులకు రూ.27,400 గా నిర్ణయించారు.
ఈ టూర్ లో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు.. తదితర ప్రముఖ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇక ఈ పర్యటన మొత్తం 7 రోజులు, 8 రాత్రులుగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన రైలు.. సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్టేషన్లలో ఏదైనా స్టేషన్ నుంచి మీరు రైలు ఎక్కే అవకాశం ఉంది.
ఇక ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు అరుణాచలం చేరుకుంటుంది. అక్కడి నుంచి భక్తులు వసతి గృహానికి వెళ్తారు. అనంతరం అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మూడో రోజు రామేశ్వరం ఆలయ దర్శనం ఉంటుంది. అలా రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది. నాలుగోరోజు రామేశ్వరం నుంచి మధురై వెళ్తారు. ఐదో రోజు రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్ సెట్ పాయింట్ ను సందర్శిస్తారు. ఇక కన్యాకుమారిలోనే డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

ఇక ఆరో రోజు త్రివేండ్రం బయలుదేరుతారు. అక్కడ శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్ ను సందర్శిస్తారు. ఏడోరోజు బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అలా చివరగా సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. తంజావూరు రైల్వే స్టేషన్ లో రాత్రి 8 గంటలకు ట్రైన్ ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాణంలోనే ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రాత్రి 9 గంటలకు రైలు చేరుకుంటుంది. దాంతో ఈ టూర్ ముగుస్తుంది. ఇక టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications