Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శశికుమార్ ఆ రెండు గంటలు ఏం చేశాడు?: ఆ నలుగురు వ్యక్తులపై ఆరా

హైదరాబాద్‌: హిమాయతనగర్‌లో జరిగిన డాక్టర్ల కాల్పుల ఘటనలో చిక్కులు వీడడం లేదు. తెరపైకి వచ్చిన మరో నలుగురు వ్యక్తులు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్‌ శశికుమార్‌ సూసైడ్‌ నోట్‌లో ఓబుల్‌రెడ్డి, రామారావు, కె.కె.రెడ్డి, చెన్నారెడ్డిలను శిక్షించాలంటూ రాశాడు. కానీ వీరు ఎవరనేది ఇంతవరకూ తెలియరాలేదు.

కాగా, తన భర్త ఇంటినుంచి తీసుకెళ్లిన కారు, బ్రీఫ్‌కేసు కనిపించడంలేదని శశికుమార్‌ భార్య చెబుతున్నారు. అయితే కారును పోలీసులు హిమాయత్‌నగర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఘటనాస్థలం వద్ద సూసైడ్‌నోట్‌తోపాటు లభించిన రివాల్వర్‌, కొడవలి, రంపాలను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

మాదాపూర్‌లోని లారెల్‌ ఆస్పత్రి భాగస్వామ్యంలో ముగ్గురు వైద్యుల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసి, ఆ తర్వాత శశికుమార్‌ ఫాంహౌ్‌సలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రత్యక్షసాక్షి సాయికుమార్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కాల్పులు జరిపింది శశికుమారేనని పోలీసులు నిర్ధారించారు.

Doctor Shashi Kumar death: police enquir about four persons

రివాల్వర్‌లో లభించిన బుల్లెట్‌, ఉదయ్‌ శరీరం నుంచి తీసిన బుల్లెట్‌లోని అవశేషాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు నార్త్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.కాల్పుల్లో గాయపడిన డాక్టర్ ఉదయ్‌ ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రస్తుతం ఐసీయూలో ఉండటంతో తర్వాత ప్రశ్నిస్తామని చెబుతున్నారు. మిగిలిన నలుగురు వ్యక్తులకు సంబంధించిన దర్యాప్తును మొయినాబాద్‌ పోలీసులు చేపట్టినట్లు డీసీపీ వివరించారు.

సోమవారం సాయంత్రం 4.00 నుం చి 4.15గంటల మధ్యలో కాల్పుల ఘటన జరగగా శశికుమార్‌ 6 గంటల సమయంలో సోమాజిగూడలోని చంద్రకళ ఇంటికి వెళ్లాడు. హిమాయతనగర్‌ నుంచి సోమాజిగూడ వెళ్లేందుకు అరగంట సమయం సరిపోతుంది. కానీ రెండు గంటల తర్వాత అక్కడకు చేరాడు.

రాత్రి 8 గంటల సమయానికి మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సకు చేరినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. కాల్పుల ఘటన తర్వాత ఫోన్‌కాల్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు.

కానీ ఉన్నతాధికారులు మాత్రం చంద్రకళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే ఫామ్‌హౌ్‌సకు వెళ్లారంటూ వివరించారు. కాల్‌డేటాలో శశికుమార్‌ ఆత్మహత్యకు ముందు ఎవరితో మాట్లాడాడనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.

కారులోనే బ్రీఫ్ కేసు

పోలీసులు శశికుమార్ కారును సీజ్ చేశారు. కారులోనే బ్రీఫ్ కేసు ఉంది. 14 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో దొరికిన వ్యక్తిగత వస్తువులను కుటుంబానికి అప్పగించారు. పెద్ద మొత్తంలో చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+