బిగ్ బాస్ షోలో డ్రగ్ రాకెట్ నోటీసులు అందుకున్న వారు, తలనొప్పి?
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఆదివారం ప్రారంభమైన తెలుగు వర్షన్ బిగ్ బాస్లో టాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న వారు ఉన్నారని, అది సిట్ అధికారులకు తలనొప్పి తీసుకు వచ్చిందని అంటున్నారు.
హైదరాబాద్: ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఆదివారం ప్రారంభమైన తెలుగు వర్షన్ బిగ్ బాస్లో టాలీవుడ్ను కుదిపేసిన డ్రగ్స్ దందాలో ఇరుక్కున్న వారు ఉన్నారని, అది సిట్ అధికారులకు తలనొప్పి తీసుకు వచ్చిందని అంటున్నారు.
థర్డ్ లిస్ట్లో యంగ్ హీరోయిన్స్, నేతల పిల్లలు?: ఆరుగురి పేర్లు బయటకొస్తే పెద్ద కుదుపు
డ్రగ్స్ కేసులో ఐటం సాంగ్ గర్ల్ ముమైత్ ఖాన్కు సిట్ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించింది. మరో ఒకరిద్దరికి కూడా ఈ దందాలో ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోందని ప్రచారం సాగుతోంది.
బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా
ఇంకా సిట్ అధికారులు సెకండ్ లిస్ట్ పంపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా 70 రోజుల పాటు హౌస్లోకి వెళ్లారు. ఇది సిట్ అధికారులకు తలనొప్పిని తెస్తోందని అంటున్నారు.
Recommended Video
అసలు నోటీసులు వచ్చాయా?
ఇదిలా ఉండగా, తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, తనపై వట్టి ప్రచారం సాగుతోందని ముమైత్ ఖాన్ ఇంతకుముందే వివరణ ఇచ్చారు. అయితే, నోటీసులు ఇచ్చారా లేదా, ఇస్తే మాత్రం చిక్కులే అని అంటున్నారు.
కొరియర్ సంస్థలకు నోటీసులు
డ్రగ్ రాకెట్ కేసులో పలు కొరియర్ సంస్థలకు ఎక్సైజ్ ఎన్పోర్సుమెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గోవా నుంచి హైదరాబాద్కు కొరియర్ ద్వారా భారీగా డ్రగ్స్ సరఫరా అయినట్లు సిట్ విచారణలో నిందితుడు కెల్విన్ వెల్లడించాడు.
ఎవరు, ఎక్కడి నుంచి?
ఈ నేపథ్యంలో డ్రగ్స్ పంపిన వారు, డెలివరీ తీసుకున్న వారు ఎవరు అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకోసం అధికారులు నోటీసులు జారీ చేశారు.