జగన్ జగతి కేసును బదిలీ చేయండి: కోరిన ఈడి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులలో జగతి పెట్టుబడుల కేసును ఆర్థిక నేరాల కోర్టుకు బదిలీ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టును కోరింది. ఈ మేరకు రూ.34.65 కోట్ల పెట్టుబడులపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం విచారణ కోసమే ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తన పిటిషన్లో ఈడీ తెలిపింది.
సీబీఐ దర్యాప్తు పూర్తిచేసిన ఈ కేసును తమశాఖ కోర్టుకు బదిలీ చేయాలని లోగడ ఈడీ అధికారులు కోరగా సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే పీఎంఎల్ చట్టంలోని సెక్షన్ 44(1)(సి)ని అన్వయిస్తూ తాజాగా ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో నిందితుడైన శ్రవణ్ గుప్తా విదేశీ ప్రయాణానుమతి సెప్టెంబర్ 2తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా విజ్ఞప్తి మేరకు ఆర్నెల్లు పొడిగిస్తూ సీబీఐ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగతి పబ్లికేషన్స్లో టీఆర్ కన్నన్, మాధవ్ రామచంద్ర, ఎకె దండమూడిలు పెట్టిన రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసు సిసి 9/2ను ఈడి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరింది.
ఇదిలావుంటే, వ్యాపార వ్యవహారాల నిమిత్తం మరో ఆరు నెలల పాటు విదేశాలకు వెళ్లడానికి ఎమ్మార్ కేసులో నిందితుడైన శ్రవణ్ గుప్తాకు సోమవారం సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications