షాక్: 40% పెరిగిన గుడ్డు ధర, ఒక్కో గుడ్డు రూ.7.50
కోడిగుడ్డు ధరలు 40 శాతం పెరిగాయి. దీంతో ఒక్క గుడ్డు ధర రూ. 7 నుండి రూ.7.50లకు చేరుకొంది. రూ.4ల నుండి ఏకంగా ఏడు రూపాయాలకు పైగా గుడ్డు ధర చేరుకొంది.
హైదరాబాద్: కోడిగుడ్డు ధరలు 40 శాతం పెరిగాయి. దీంతో ఒక్క గుడ్డు ధర రూ. 7 నుండి రూ.7.50లకు చేరుకొంది. రూ.4ల నుండి ఏకంగా ఏడు రూపాయాలకు పైగా గుడ్డు ధర చేరుకొంది. కోడి గుడ్ల సరఫరా తగ్గిపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు పౌల్ట్రీ ఇండస్ట్రీవర్గాలు.
వచ్చే నెలల్లో కూడా కోడి గుడ్డు ధరలు మరింత పెరగనున్నట్టు ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రమేష్ కాత్రి అభిప్రాయపడ్డారు. గుడ్ల ఉత్పత్తి ఈ పెరిగాయని చెప్పారాయన. 2016-17లో హోల్సేల్గా గుడ్డు ధరలు రూ.4 కంటే తక్కువగానే ఉండేవి.
కోడి గుడ్ల ధర పెరగడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని హోల్సేల్ వ్యాపారులు వాపోతున్నారు.నవంబర్, డిసెంబర్, జనవరి కాలంలో ఉత్తర భారతంలో వినియోగం పెరిగి రేట్లు పెరుగుతాయని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరాజు తెలిపారు. దేశ రాజధాని రిటైల్ మార్కెట్లలో కోడి గుడ్ల ధరలు ఒక్కోటి రూ.7 నుంచి రూ.7.50 మధ్యలో పలుకుతున్నాయి.