ఎంట్రెన్స్ ఫీజులా మారిన ఎన్నికల వ్యయం, ఇలా నివారించొచ్చు: లోక్సత్తా నేత జేపీ
ఎన్నికల్లో డబ్బులు పంచడంపై లోక్సత్తా నేత జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం ఎంట్రెన్స్ ఫీజులా మారిందని ఆరోపించారు. ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై భారం తగ్గించడంపై ఆలోచించాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ధన వ్యయ పరిమితిపై గురు, శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తున్నానని జేపీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకే రూ.3 వేల కోట్ల ఖర్చవుతోందని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందన్నారు. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సమాజంలో డబ్బులు అడగకుండా వయోజనులను ఓట్లు అడిగే పరిస్థితి లేదని చెప్పారు. సాధారణంగా వ్యవస్థలు మోయాల్సిన భారాన్ని పార్టీలు మోసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానమే ఎన్నికల్లో ధనప్రవాహనికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. ఈ మార్గమే మేలని తాము సూచిస్తామని పేర్కొన్నారు. ఆచరణలోకి తీసుకొస్తే మేలు జరుగుతుందని, ధన ప్రవహాన్ని కొంతైనా నిలువరించొచ్చని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications