తెలంగాణ పురపోరు : నామినేషన్ల ఉపసంహరణకు రేపే లాస్ట్ !
తెలంగాణ రాష్ట్రంలో పుర పోరు కోసం ఎన్నికల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన కీలక దశ అయిన నామినేషన్ల పరిశీలన (Scrutiny of Nominations) ప్రక్రియను ఎన్నికల అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశ పూర్తవడంతో ఎన్నికల వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2,996 వార్డులకు సంబంధించి దాఖలైన నామినేషన్లను అధికారులు సవివరంగా పరిశీలించారు.
కాగా అర్హతలు, పత్రాల సరైనత, ఎన్నికల నిబంధనల పాటింపు వంటి అంశాలను పరిశీలించిన అనంతరం చెల్లుబాటు అయ్యే నామినేషన్లను ఖరారు చేశారు. ఈ ప్రక్రియ అనంతరం ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రుల తరపున కలిపి మొత్తం 19,608 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆన్లైన్లో ప్రకటించనుంది. ఈ జాబితా ఖరారవడంతో పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు మరింత వేగవంతం కానున్నాయి.

ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి.. రెండు రోజుల అనంతరం 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
అలానే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రలోభాలకు పాల్పడకుండా ప్రచారం నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ఓటర్లను ప్రభావితం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా ఉండటం రాజకీయ ఆసక్తిని మరింత పెంచుతోంది. స్థానిక సంస్థలపై పట్టుసాధించేందుకు జరుగుతున్న ఈ పోటీని రాష్ట్ర రాజకీయాలకు సెమీఫైనల్గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications