ముగిసిన నామినేషన్ల విత్ డ్రా : పోలింగ్ ఏర్పాట్లలో ఈసీ బిజీ
హైదరాబాద్ : సార్వత్రిక సమరంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ విత్ డ్రా గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను ఈసీ ప్రకటించింది. తొలివిడత పోలింగ్ జరిగే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు నుంచి ఐదుగురు అభ్యర్థుల రేసులో ఉన్నారు. ఇక ఇందురూ లోక్సభ పోటీ ఆసక్తికరంగా మారింది.
11న పోలింగ్
తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగిస్తారు. దేశవ్యాప్తంగా మరో ఆరు విడుతల్లో ఎన్నికలు జరిగాక .. మే 23న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.

ఆసక్తికరంగా ఇందూరు
రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్సభ స్థానం ఆసక్తి రేపింది. ఇక్కడినుంచి ప్రధాన పార్టీలు కలిపి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 178 మంది రైతులు పోటీ చేస్తున్నారు. పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనందున వారి నామినేషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications