కేసీఆర్పై నిప్పులు కక్కిన ఎర్రబెల్లి, మోసగాడి ముద్ర వద్దని కేసీఆర్కు రాఘవులు
హైదరాబాద్: లెక్కకు మించి అప్పులు తీసుకొచ్చి, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దొచుకుతింటుందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు దుమ్మెత్తి పోశారు. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో జరిగిన ఆశా వర్కర్ల బహిరంగ సభకు గురువారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బోర్డులో కనపడుతున్నాయి తప్ప, ఆచరణ సాధ్యం కావడం లేదన్నారు.
ఆశా వర్కర్ల పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఆశా వర్కర్ల సమస్యలు తీర్చేంత వరకు అసెంబ్లీ జరగనివ్వమని ఈ సందర్భంగా ఎర్రబెల్లి చెప్పారు.

ఆశా వర్కర్ల కనీస వేతన డిమాండ్ సమంజమే: రాఘవులు
ఆశా వర్కర్ల కనీస వేతన డిమాండ్ సమంజమైనదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గురువారం మహబూబ్ నగర్లో జరిగిన ఆశావర్కర్ల ఆందోళన కార్యక్రమానికి ఆయన తన మద్దతు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా ఉన్న కేసీఆర్ మోసగాడిలా ముద్రవేసుకొవద్దని ఆయన హితవు పలికారు. ఆశా వర్కర్ల సమస్యసలు పరిష్కరించకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింతగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications