కేసీఆర్పై నిప్పులు కక్కిన ఎర్రబెల్లి, మోసగాడి ముద్ర వద్దని కేసీఆర్కు రాఘవులు
హైదరాబాద్: లెక్కకు మించి అప్పులు తీసుకొచ్చి, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దొచుకుతింటుందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు దుమ్మెత్తి పోశారు. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో జరిగిన ఆశా వర్కర్ల బహిరంగ సభకు గురువారం ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బోర్డులో కనపడుతున్నాయి తప్ప, ఆచరణ సాధ్యం కావడం లేదన్నారు.
ఆశా వర్కర్ల పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఆశా వర్కర్ల సమస్యలు తీర్చేంత వరకు అసెంబ్లీ జరగనివ్వమని ఈ సందర్భంగా ఎర్రబెల్లి చెప్పారు.

ఆశా వర్కర్ల కనీస వేతన డిమాండ్ సమంజమే: రాఘవులు
ఆశా వర్కర్ల కనీస వేతన డిమాండ్ సమంజమైనదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. గురువారం మహబూబ్ నగర్లో జరిగిన ఆశావర్కర్ల ఆందోళన కార్యక్రమానికి ఆయన తన మద్దతు తెలిపారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా ఉన్న కేసీఆర్ మోసగాడిలా ముద్రవేసుకొవద్దని ఆయన హితవు పలికారు. ఆశా వర్కర్ల సమస్యసలు పరిష్కరించకుంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింతగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications