మల్కాజిగిరి చౌరస్తాకు రా..: రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ సవాల్
మల్కాజిగిరి: రానున్న లోక్సభ తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో లక్ష మెజార్టీతో బీజేపీ గెలిచిందని మల్కాజిగిరి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వాదిస్తారని తెలిపారు. మల్కాజిగిరిలో తాను గత 32 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి, ప్రజలకు ఏం చేశారో తెలుసుకోవడానికి మల్కాజిగిరి చౌరస్తా వద్ద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఈటల సవాల్ విసిరారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎక్కువగా సీఎం రేవంత్ తిరిగారా లేక తాను తిరిగానా? అనేది తేల్చుకుందామా? అంటూ ఈటల ప్రశ్నించారు. దేశంలో మళ్లీ ప్రధాని అయ్యేది మోడీనే అని సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, తాము ప్రజల మధ్య తిరిగినప్పుడు చెబుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరవు అయ్యారని అన్నారు.
కచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. చదువుకున్న వాళ్లను అడిగితే ఈ దఫా మోడీనే ప్రధాని అవుతారు అంటున్నారు. బస్తీలల్లో అడిగితే సామాన్య ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడి ఎన్నికలు, వచ్చేవి మోడీ ఎన్నికలు కదా తప్పకుండా గెలుస్తారు అంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈసారి కూడా బీజేపీకి మెజార్టీ సీట్లు వస్తాయని, మోడీనే ప్రధాని అవుతారని అంటున్నారని ఈటల రాజేందర్ చెప్పారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications