హైకోర్టు జడ్జీనంటూ లక్షలు కాజేశాడు
హైదరాబాద్: ఇప్పటి వరకు నకిలీ పోలీసులు, నకిలీ డాక్టర్లనే చూశాం. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు ఏకంగా నకిలీ జడ్జీగా అవతారమెత్తాడు. అమాయక ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్న ఆ నకిలీ జడ్జీని కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు. అతడి గన్మెన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు తెలిపారు.
ఘటనకు సంబంధించి మల్కాజిగిరి డీసీపీ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నామాల నరేందర్ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉండేవాడు. గతంలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు, వాహనాలు దొంగతనాలు చేశాడు. దీంతో నరేందర్పై 2017లోనే పీడీ యాక్ట్ కూడా నమోదైంది.

అయినా, తన నేర ప్రవృత్తి మార్చుకోకుండా అదే బాటలో కొనసాగాడు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్లో ఆర్మీలో పనిచేసిన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని తనకు గన్మెన్గా నియమించుకున్నాడు నరేందర్. ఒక నకిలీ వెబ్సైట్ తయారు చేయించుకుని.. ప్రజలకు హైకోర్టు జడ్జీగా చెబుతూ మోసం చేస్తున్నాడు. భూ తగాదాలు, సమస్యలు ఏవైనా తాను పరిష్కరిస్తానంటూ నకిలీ వెబ్సైట్ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడు.
ఇలా చాలా మంది వద్ద రూ. లక్షలు వసూలు చేస్తున్నాడు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్జడ్జిగా తిరుగుతున్న నరేందర్ను ఇటీవల ఖమ్మంలో అరెస్ట్ చేశారు. దీంతో జైలు నుంచి బయటికి వచ్చిన నరేందర్.. హైదరాబాద్కు మకాం మార్చాడు. హైదరాబాద్ నగరంలో అడిషనల్ సివిల్ జడ్జీగా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే తొర్రూర్కు చెందిన సోమిరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి.. అతడి వద్ద నుంచి నరేందర్ రూ. 10 లక్షలు వసూలు చేశాడు.
తన భూ సమస్యను పరిష్కరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేందర్ను విచారించడంతో నకిలీ జడ్జీ అని తేలింది. దీంతో నరేందర్ను, అతని గన్మెన్ మధుసూదన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక తుపాకి, 5బుల్లెట్లు, ఒక కారు, ఒక మొబైల్, నగదు, నకిలీ విజిటింగ్ కార్డ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications