ఘోర ప్రమాదం: సీఐ దంపతులు మృతి -లారీని ఢీకొట్టిన కారు -డ్రైవింగ్ సీటులో భార్య, కొడుకు సేఫ్
హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుసుకుంది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారి, ఆయన భార్య దుర్మరణం చెందారు.
అబ్దుల్లాపూర్మెట్ లో యాక్సిడెంట్ కు గురైన కారు.. సుల్తాన్ బజాన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తోన్న లక్ష్మణ్దిగా గుర్తించారు. ప్రమాదంలో సీఐ లక్ష్మణ్ తోపాటు ఆయన భార్య ఝాన్సీ ఘటనా స్థలంలోనే కన్నుమూయగా, వారి ఎనిమిదేళ్ల కొడుకు గాయాలతో బయటపడ్డాడు.

డిటెక్టివ్ ఇన్స్పెక్టరైన లక్ష్మణ్ కుటుంబంతో కలిసి సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో సీఐ భార్య ఝాన్సీ కారును నడిపినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Recommended Video
PM Modi కి Ys Jagan బాసట, Jarkhand Cm కి క్లాస్ పీకిన AP CM || Oneindia Telugu












Click it and Unblock the Notifications