అన్ని కేసులూ నమోదు చేయాలి: తెలుగు రాష్ట్రాల డీజీపీలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కాగ్నజబుల్, నాన్ కాగ్నజబుల్ నేరాల్లో తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని సోమవారం హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది.
వి మహేంద్ర, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటీషన్లు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అన్ని కేసులను నమోదు చేయడం లేదని తెలిపింది.

ప్రాథమిక విచారణను ఏ కేసులోనైనా 7 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు జడ్జి జస్టిస్ పివి సంజయ్కుమార్ పేర్కొన్నారు.
కాగ్నజబుల్ నేరాల్లో ఏ పోలీసు ఆఫీసర్ కేసు నమోదు చేయకుండా తప్పించుకోలేరని, విధిగా నమోదుచేయాలని ఆదేశించారు. కేసు నమోదు చేయని అధికారి చట్టప్రకారం చర్యలకు అర్హుడని జస్టిస్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications