పంజాగుట్టలోని భవనంలో అగ్ని ప్రమాదం(ఫోటోలు)
హైదరాబాద్: పంజాగుట్టలో శనివారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాగుట్ట ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న ఓ ఐదంతస్థుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు.
తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైరింజన్ సిబ్బంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ భవనంలో పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
భవనంలో పొగలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు, ఇతరులు భయంతో బయటికి పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పంజాగుట్టలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
పంజాగుట్టలో శనివారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పంజాగుట్ట ఫ్లై ఓవర్ దగ్గర ఉన్న ఓ ఐదంతస్థుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

పంజాగుట్టలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకున్నారు.

పంజాగుట్టలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైరింజన్ సిబ్బంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

పంజాగుట్టలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
ఈ భవనంలో పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

పంజాగుట్టలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
భవనంలో పొగలు వ్యాపించిన వెంటనే అప్రమత్తమైన ఉద్యోగులు, ఇతరులు భయంతో బయటికి పరుగులు తీశారు.

పంజాగుట్టలోని భవనంలో భారీ అగ్ని ప్రమాదం
ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications