మృత్యు రహదారులు: వేర్వేరు ప్రమాదాల్లో 10మంది మృతి, ఒకే కుటుంబంలో ఐదుగురు
మూడు వేర్వేరు ప్రమాదాల్లో సోమవారం పది మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక కారు డివైడర్ను దాటి మరీ మరో కారును ఢీ కొనడంతో ఐదుగురు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు.
పెద్దపల్లి/జహీరాబాద్: మూడు వేర్వేరు ప్రమాదాల్లో సోమవారం పది మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక కారు డివైడర్ను దాటి మరీ మరో కారును ఢీ కొనడంతో ఐదుగురు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు.
కరీంనగర్కు వెళ్తున్న ఎండీ అజీమ్ కారును అందుగులపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొనడంతో అజీమ్(35)తో పాటు ఆయన భార్య అర్షియా సుల్తానా(28), కూతురు అర్ఫా(1) అక్కడికక్కడే మృతి చెందారు.
కరీంనగర్కు తరలిస్తుండగా అజీమ్ కూతురు ఆయేషా(5), సోదరుడి భార్య ఆఫ్రిన్(22) చనిపోయారు. అజీమ్ కుమారుడు జయాన్, సోదరుడు నజీర్ (28), ప్రమాదానికి కారణమైన కారులోని సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరో ఘటనలో మహారాష్ట్రలోని తుల్జాపూర్ కాలి నడకన వెళ్తున్న ముగ్గురు మహిళా భక్తులను కర్నాటకలోని హుమ్నాబాద్ సమీపంలో లారీ ఢీకొనడంతో మృతి చెందారు. మృతుల్లో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన గౌరమ్మ(30), వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన లక్ష్మి, కర్ణాటకలోని ఘనాపూర్కు చెందిన లక్ష్మి ఉన్నారు.
సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న శంకర్, ఆరె లక్ష్మయ్య, ముత్తంగా అశోక్లను మారుతీ సుజికీ ఎకో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో శంకర్, లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ కాలు విరిగింది.