దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో 18 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఐదుగురు తెలంగాణ వాసులు: కేటీఆర్ కృషి
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఓ హత్య కేసులో ఇరుక్కుని 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తెలంగాణకు చెందిన ఐదుగురిని అక్కడి కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. దశాబ్దకాలంపాటు ఎదురుచూసిన వారి కుటుంబసభ్యులు ఆ వలస కార్మికులు సొంత ఊరికి చేరుకోవడంతో పండగ వాతావరణం నెలకొంది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. అయితే, ఊహించని విధంగా నేపాల్కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కోగా, తెలంగాణకు చెందిన ఈ ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్లు జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు.. నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

ఈ విషయం మీడియా ద్వారా 2011లో కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో వారిని సురక్షితంగా రప్పించేందుకు ప్రయత్నం చేశారు. స్వయంగా నేపాల్కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో జాప్యం జరిగింది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు.
మరోసారి బాధితుడి అనారోగ్య కారణాలను చూపుతూ మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. వారి దీనస్థితిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆర్ క్షమాభిక్ష కింద విడిపించేందుకు ప్రయత్నించారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో వలస కార్మికులు స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా 6 నెలల క్రితం జగిత్యాల జిల్లా వాసి విడుదల కాగా, హన్మంతు ఇటీవల 17న ఇంటికి చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో సిరిసిల్ల, రుద్రంగి, కోనరావుపేట మండలాలకు చెందిన నలుగురు బుధవారం స్వదేశానికి చేరుకున్నారు.
So glad these guys are home 😊 https://t.co/bovGSMJ19t
— KTR (@KTRBRS) February 21, 2024
చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి వెంకటి కూడా త్వరలో రానున్నట్లు దుబాయ్లో ఉన్న వారి స్నేహితులు తెలిపారు. బాధితుల తరఫున న్యాయవాది అనురాధ అహర్నిశలు కృషి చేశారని.. కేటీఆర్ ఆర్థిక సహాయంతో పాటు తన వంతు ప్రయత్నాలు చేశారని బాధితులు తెలిపారు. కేటీఆర్ విమాన ఖర్చులు భరించి, స్వదేశానికి రప్పించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో బాధితులను కలిసిన వారి కుటుంబసభ్యులు ఆనందం వెల్లివిరిసింది. దీంతో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications