వికటించిన పెళ్లి విందు.. 300 మందికి అస్వస్థత
నిర్మల్ : అప్పటివరకు ఆనందంగా ఉన్న పెళ్లిమంటపంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. భైంసాలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో పాయసం తిన్న దాదాపు మూడు వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. విందులో వడ్డించిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మొదటి రెండు బంతుల్లో భోజనం చేసినవారు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తొలుత భోజనం చేసిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించడంతో.. భోజనం తిన్న ఇతరులు తమకు ఏమికాకున్నా భయంతో ఆసుపత్రులకు క్యూ కట్టినట్లు సమాచారం. ఆ మేరకు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు బాధితులు. ఈ ఘటనలో అధికశాతం చిన్నారులు ఉండటంతో ఆందోళన ఎక్కువగా కనిపించింది.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications