వికటించిన పెళ్లి విందు.. 300 మందికి అస్వస్థత
నిర్మల్ : అప్పటివరకు ఆనందంగా ఉన్న పెళ్లిమంటపంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. భైంసాలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో పాయసం తిన్న దాదాపు మూడు వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. విందులో వడ్డించిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మొదటి రెండు బంతుల్లో భోజనం చేసినవారు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తొలుత భోజనం చేసిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించడంతో.. భోజనం తిన్న ఇతరులు తమకు ఏమికాకున్నా భయంతో ఆసుపత్రులకు క్యూ కట్టినట్లు సమాచారం. ఆ మేరకు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు బాధితులు. ఈ ఘటనలో అధికశాతం చిన్నారులు ఉండటంతో ఆందోళన ఎక్కువగా కనిపించింది.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications