వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికటించిన పెళ్లి విందు.. 300 మందికి అస్వస్థత

|
Google Oneindia TeluguNews

నిర్మల్ : అప్పటివరకు ఆనందంగా ఉన్న పెళ్లిమంటపంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. భైంసాలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన పెళ్లిలో పాయసం తిన్న దాదాపు మూడు వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. విందులో వడ్డించిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మొదటి రెండు బంతుల్లో భోజనం చేసినవారు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

food poison

వాస్తవానికి తొలుత భోజనం చేసిన కొందరికి వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించడంతో.. భోజనం తిన్న ఇతరులు తమకు ఏమికాకున్నా భయంతో ఆసుపత్రులకు క్యూ కట్టినట్లు సమాచారం. ఆ మేరకు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు బాధితులు. ఈ ఘటనలో అధికశాతం చిన్నారులు ఉండటంతో ఆందోళన ఎక్కువగా కనిపించింది.

English summary
Marriage function cause to illness for several people in bhainsa, nirmal district. Not only one or two, but 300 victims of illness. They moved to nearby area hospital and treatment started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X