ఇప్పు పువ్వు కోసం వెళ్తే.. గిరిజన యువతిని రేప్ చేసిన అటవీ అధికారులు..
మిగతా ఇద్దరు గట్టిగా ప్రతిఘటించడంతో తీవ్ర పెనుగులాట జరిగింది. చివరకు దూలమ్మను అపహరించిన ఫారెస్టు అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
తాడ్వాయి: అమాయక గిరిజన మహిళల పట్ల మదమెక్కిన అటవీశాఖ అధికారులు కామంతో రెచ్చిపోయారు. ఇప్ప పువ్వు కోసం వెళ్లిన ఓ మహిళను వేధించి..వెంబడించి అపహరించారు. ఆపై సదరు గిరిజన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గొత్తి కోయగూడాలకు చెందిన సోడి సోమిడి(17), సోడి బీమమ్మ(22), దూలమ్మ(22) అనే ముగ్గురు గిరిజన యువతులు ఇప్ప పువ్వు కోసం ముసలమ్మ పెంట సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ బేస్ క్యాంప్ అధికారులు సంతోశ్, విజయ్ల కన్ను దూలమ్మపై పడింది.

ఆ ముగ్గురిని వెంబడించి దూలమ్మను అక్కడినుంచి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. మిగతా ఇద్దరు గట్టిగా ప్రతిఘటించడంతో తీవ్ర పెనుగులాట జరిగింది. చివరకు దూలమ్మను అపహరించిన ఫారెస్టు అధికారులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటికే మిగతా ఇద్దరు గ్రామ పెద్దలకు సమాచారం అందించడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications