గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో కలకలం: చికెన్ బిర్యానీలో కప్ప కళేబరం!
హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించడం కలకలం రేపింది. బిర్యానీలో కప్పను చూసిన విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే మెస్ ఇంఛార్జీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షం అంటూ సోషల్ మీడియాలో ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది.
అక్టోబర్ 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కదాంబ మెస్లో చికెన్ బిర్యానీ తీసుకోగా.. అందులో కప్ప వచ్చింది. బిర్యానీలో వచ్చిన కప్ప కళేబరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం బహిర్గతమైంది. ట్రిపుల్ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్కు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే బయట ఫుడ్ తినాలంటేనే ప్రజలు జంకుతున్నారు. జంట నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడుతున్నారంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయం తెలిసిందే. వైన్ షాపుల వద్ద చికెన్ వంటకాలను అందించే స్టాళ్లకు సరఫరా చేసే ఓ స్టోరేజీ నుంచి సుమారు 700 కిలోల కుళ్లిపోయిన చికెన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకులపై చర్యలు తీసుకున్నారు.
Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob
— ram manohar (@manoharrocksss) October 17, 2024
మరోవైపు, జంట నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పరిశుభ్రత ఉండటం లేదని, గడువు తీరిన పదార్థాలను వాడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ హోటళ్లతోపాటు పలు ప్రముఖ హోటళ్లలోనూ పరిశుభ్రత, నాణ్యత అంతంత మాత్రంగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications