నయీమ్ డెడ్ బాడీ పక్కన మహిళ మృతదేహం! ఎవరిదై ఉంటుంది?
మహబూబ్ నగర్ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ హత్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పక్కా ప్లానింగ్ తో నేటి ఉదయం నయీమ్ ను పోలీసులు మట్టుబెట్టగా..! నయీమ్ హత్య జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే మరో మహిళ చనిపోయి ఉండడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం.. ఆ మృతదేహం ఎవరిదా? అన్న కోణంలో నిజనిజాలను వెలికి తీసే పనిలో పడ్డారు పోలీసులు.
అయితే నయీమ్ ను పోలీసులు హతమార్చే క్రమంలో.. అతడితో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించిన మహిళదే ఈ మృతదేహం అయి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉగ్రవాదులతోను నయీమ్ కు ఏమైనా లింకులు ఊన్నాయా..? అన్న అనుమానాలు ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఉగ్ర కార్యకలాపాల నేపథ్యంలోనే.. నయీమ్ ఆదివారం రాత్రి షాద్ నగర్ చేరుకున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.












Click it and Unblock the Notifications