హైడ్రా అధికారులకు అమ్రపాలి వార్నింగ్..!!
హైడ్రాలో అధికారుల పై జీహెచ్ఎంసీ కమిషన్ అమ్రపాలీ సీరియస్ అయ్యారు. హైడ్రా కొద్ది రోజులుగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ సైతం హైడ్రా కు మరిన్ని అధికారాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా నిర్ణయాలతో
హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ చెరువులను ఆక్రమించి నిర్మాణాలను క్రమబద్దీకరించేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా ఆ నిర్మాణాల విషయంలో కఠినంగా ఉంటుందని స్పష్టం చేసారు. హైడ్రాను మరింతగా విస్తరించటంతో పాటుగా మరిన్ని అధికారాలు ఇవ్వటం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కమిషనర్ సీరియస్
హైడ్రాకు సిబ్బందిని పలు విభాగాల నుంచి సర్దుబాటు చేసారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం హైడ్రాలో పనిచేస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, ఆ అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు అని కమిషనర్ ఆమ్రపాలి పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.
అమ్రపాలీ ఆదేశాలు
విచారణలు, రోజువారీ కార్యక్రమాలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉందని, కానీ వారు ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదని స్థాయీ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె స్పందించారు. హైడ్రా కమిషనర్కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించు కోవడం లేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది. వారి తీరు పైన అభ్యంతరాలు రావటంతో అమ్రపాలీ ఈ స్థాయిలో స్పందించినట్లు సమాచారం.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications