పెళ్లికి నో: ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలి సమాధి
నల్గొండ: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రియురాలి మృతదేహాన్ని ఆమె బంధువులు ప్రియుడి ఇంటి ఆవరణలోనే సమాధి చేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. తాళ్ల సింగారం గ్రామానికి చెందిన వసంత అనే ఇరవై ఏళ్ల యువతి, అదే గ్రామానికి చెందిన మహేష్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో వసంత శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి మహేష్ కారణమని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్థులు ప్రియుడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.

వసంత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించేందుకు ప్రియుడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఆగ్రహించిన బంధువులు ప్రియుడి ఇంటి ఆవరణలోనే వసంత మృతదేహాన్ని సమాధి చేశారు.












Click it and Unblock the Notifications