స్కూల్లో గోడకుర్చీ వేయించి చిన్నారిని చంపేశారు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో వేసిన శిక్ష కారణంగా ఐదో తరగతి చదువుతున్న అశ్విత అనే చిన్నారి అస్వస్థతకు గురై మృత్యువాత పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది.
దారుణమైన సంఘటనను నిరసిస్తూ అశ్విత తల్లిదండ్రులతో పాటు స్థానికులు పాఠశాల వద్ద గురవారం ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హోం వర్క్ చేయలేదనే కారణంతో వరుసగా ఐదు రోజుల పాటు అశ్వితను పాఠశాలలో గోడ కుర్చీ వేయించారు. దాంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది.

రెండు రోజుల క్రితం అశ్వితను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. లెక్కలకు సంబంధించిన హోం వర్క్ చేయలేదని తెలుస్తోంది. అయితే, హోం వర్క్ చేయలేదనే కారణంతో పాఠశాలలో శిక్ష వేయడం సాధారణమేనని అనుకున్న తల్లిదండ్రులు తొలుత సంఘటనను తేలికగా తీసుకున్నారని తెలుస్తోంది.
గోడకుర్చీ వేయించడం వల్లనే అశ్విత మరణించిందనే కారణంతో పాప బంధువులు వివేరవర్థిని పాఠశాల వద్ద ధర్నాకు దిగారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications