Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచ తెలుగు మహా సభలు 2017.. కమ్మనైన పాటల సంగమం..

Recommended Video

    World Telugu Conference 2017 : కమ్మనైన పాటల సంగమం..

    హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు.

    రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, శాససభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనాయకుడు కే కేశవరావు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

    Glimpse at prapancha telugu mahasabhalu 2017

    ఈ నెల డిశంబర్ 15 నుండి 19 వరకు జరుగుతున్న ఈ సభలకు ఇప్పటికే హాజరైన భాషాభిమానులు, కవులు, సాహితీవేత్తలతో నగరానికి కొత్తకళ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లలో లోటుపాట్లు ఉన్నప్పటికీ హాజరైన వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన... జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ పరిషత్తు నుంచి 250 మందిని తీసుకొచ్చిన వేల్పులస్వామి యాదవ్ కమ్మనైన తెలుగు పద్యం పాడుతూ తన అనుభూతిని పంచుకున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+