ఆనంద్ నగర్ ఆగ్రహం, కదిలిన గవర్నర్: రాజకీయాల్లో అసహనం: కెసిఆర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు ఆనంద్ నగర్ కాలనీలో అకస్మాత్తుగా పర్యటించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన పర్యటించారు. పలువురు స్థానికులు రాజ్ భవన్కు ఉదయం నుంచి ఫోన్లు చేసి ఫిర్యాదులు చేశారు.
తమ కాలనీ తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గవర్నర్ ఆనంద్ నగర్ కాలనీలో పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనంద్ నగర్ స్వచ్ఛ భారత్ ప్యాట్రన్గా గవర్నర్ నరసింహన్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఫిర్యాదులు రావడంతో... ఆయన స్వచ్ఛ భారత్ జరుగుతున్న తీరును పరిశీలించారు. కాలనీలో పరిస్థితి బాగా లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అపార్టుమెంటుల్లోకి వెల్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీరు, డ్రెయినేజ్ లైన్లను పరిశీలించారు. రోడ్లపై నీరు ఆగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రాజకీయాల్లో అసహనం పెరుగుతోంది: కెసిఆర్
ప్రస్తుత రాజకీయాల్లో అసహనం పెరుగుతోందని, ఇది మంచిది కాదని తెలంగాణ సీఎం కెసిఆర్ అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం జరగనివ్వనని చెప్పారు. గ్రాండ్ కాకతీయలో జరుగుతున్న జేవీ నర్సింగరావు శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జేవీ నర్సింగరావు విలక్షణమైన వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచిని, చెడునూ భరిస్తూ వెళ్లిన వ్యక్తి నర్సింగ రావు అన్నారు. జీవీ బతికి ఉండి ఉంటే ఉన్నతస్థాయికి వెళ్లేవారని, ఆయన విశిష్టతను ముందు తరాలకు తెలియజేసేందుకు వారి కుటుంబసభ్యులతో మాట్లాడి నిర్ణయిస్తామన్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications