అపోహలు,అనుమానాలు.... కరోనా 'భయం'తో ప్రభుత్వ ఉద్యోగి బలి...
కరోనా వైరస్ పట్ల సమాజంలో అశాస్త్రీయ ఆలోచనలు,అపోహలు గూడు కట్టుకున్నాయి. అనవసర భయాందోళనలతో ప్రాణాలు తీసుకుంటున్నవారు కొందరైతే.. కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపిస్తున్నవారు మరికొందరు. చదువుకున్నవాళ్లు.. సమాజంలో ఒకింత బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్లు సైతం కరోనా విషయంలో గందరగోళానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి.
తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాజా వెంకటరమణ(54) అనే ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండ్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఇటీవల జ్వరం బారిన పడ్డారు.ఈ క్రమంలో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా... కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అనంతరం తన కార్యాలయానికి వెళ్లిన వెంకటరమణ సాయంత్రం వరకూ అక్కడే విధుల్లో ఉన్నారు.

Recommended Video
విధులు ముగించుకున్న అనంతరం మంచిర్యాలలోని ఇంటికి వెళ్లకుండా... కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న తన ఫ్లాట్కి వెళ్లాడు. అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంకటరమణ ఫోన్కి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. కరీంనగర్లోని బంధువులకు ఫోన్ చేసి... ఫ్లాట్ వద్దకు వెళ్లి చూడాలని కోరారు. దీంతో వారు ఫ్లాట్ వద్దకు వెళ్లగా... లోపల వెంకట రమణ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications